"ముద్ర" కథనానికి స్పందన - యవతిని ట్రాప్ చేసిన ఏఎస్సై సస్పెండ్..

"ముద్ర" కథనానికి స్పందన - యవతిని ట్రాప్ చేసిన ఏఎస్సై సస్పెండ్..
  • ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ..

మెట్‌పల్లి ముద్ర :- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎస్పై రాములుపై ఉన్నతధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఈ నెల 26 న "ముద్ర" లో "న్యాయం కోసం వచ్చిన యువతితో ఏఎస్ఐ రాసలీలలు" ఏఎస్సై' కథనం ప్రచురితం కాగా మల్టీ జోన్ 1 ఐజీ ఏ.వి రంగనాథన్ వ్యవహారం సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టారు. ఏఎస్పై వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం కావడంతో ఏఎస్సై రాములును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇదిలా ఉండగా ఠాణాకు వచ్చిన మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతధికారులు దృష్టి సారించి ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.