బడి పిల్లలా.. పని మనుషులా..? - విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు..

బడి పిల్లలా.. పని మనుషులా..? - విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించుకుంటున్నారు. ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ హైస్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను పని మనుషులు గా చేస్తున్నారు. ప్రతి పనికి విద్యార్థులను పంపిస్తూ ఇబ్బందులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. త్రాగునీటి కోసం విద్యార్థులను వాటర్ ప్లాంట్ వద్దకు పంపించగా ఉపాధ్యాయులకు భయపడి ఎదురు చెప్పలేకపోతున్న విద్యార్థులు మోయలేని బరువున్న వాటర్ క్యాన్లను నింపుకొని పాఠశాలకు మోసుకెల్తున్నారు. పాఠశాలలో ఏ పని ఉన్న విద్యార్థులతో చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న ఈ పనికి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసిన ఏమాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.