రాహుల్ గాంధీ బస్సు యాత్రకు బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు - నడిగోటి రాము   

రాహుల్ గాంధీ బస్సు యాత్రకు బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు  - నడిగోటి రాము   

మొగుళ్లపల్లి, ముద్ర : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీతో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నీల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి, అధికార ప్రతినిధి నీరటి మహేందర్,  నాయకులు పడిదల ప్రకాష్ రావు,మల్సాని రాజేశ్వర్ రావు,ఎండి రఫీ, గుర్రపు అన్నారెడ్డి, బద్దం మోహన్ రెడ్డి, వనం తిరుపతి, బండారి కొమురయ్య తదితరులున్నారు.