బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం
![బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6530f4b2b03d7.jpg)
ముద్ర, యాదగిరిగుట్ట : బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ గా యాదగిరిగుట్టకు చెందిన రంగా రేఖ, కో కన్వీనర్ గా అమరాజు శిరీష లు నియమితులయ్యారు. గురువారం రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రంగా రేఖ, అమరాజు శిరీష లు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతామని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి కి ధన్యవాదములు తెలిపారు.