గాజులపల్లి లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య..

గాజులపల్లి లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య..

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  మంథని మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ (21) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదర్శ్ శుక్రవారం రాత్రి ఇంటిలో నుండి బయటకు వెళ్లాడన్నారు. తెల్లవారుజామున చెట్టు కు ఉరి వేసుకున్నట్లు తెలిసిందన్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడు కాదని.. తమ కుమారుడు మృతి పై అనుమానాలు ఉన్నాయన్నారు.