పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకొన్న సీపీ, టాస్క్ ఫోర్స్ టీమ్ మేరుపు దాడి

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకొన్న సీపీ, టాస్క్ ఫోర్స్ టీమ్ మేరుపు దాడి

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకొన్న సీపీ, టాస్క్ ఫోర్స్ టీమ్ మేరుపు దాడి

 వారి వద్ద రూ. 14,48,000 లక్షల భారీ నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

విలేకరుల సమావేశంలో రామగుండం సిపి శ్రీనివాసులు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పేకాట ఆడుతున్న స్థావరంపై మెరుపు దాడి చేసి 10 మంది వ్యక్తులను పట్టుకొన్నమని రామగుండం సిపి శ్రీనివాసులు మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి  మాట్లాడుతూ  టాస్క్ ఫోర్స్ టీమ్, టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ అధ్వర్యంలో ఎస్ఐ  ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చెన్నూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు  మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు (పేకాట) ఆడుతున్నారనే, పక్కా సమాచారంతో పేకాట  స్థావరం పై దాడి చేసి 10 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున 10  సెల్ ఫోన్లు, రూ. 14,48,000 లక్షల నగదు, పేక ముక్కలు  స్వాధీనపరుచుకున్నమన్నారు. 
సందెల తిరుపతి, అన్నాల తిరుపతి, చోటు, వరంగల్ మొదలగు కొంతమంది కలిసి ఒక టీం గా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ ఆసిఫాబాద్, ఏరియల నుండి పేకాటా ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని, కొంత పెట్టుబడి పెట్టి,  అటవి ప్రాంతాలలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటుచేసి, వచ్చిన ఆటగాళ్ల నుండి కొంతమొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు రూ. 5 లక్షల వరకు పెట్టడం జరుగుతుందని, వచ్చిన ప్లేయర్ల నుండి కొంత మేర కమిషన్ కింద వసూలు చేస్తూ, సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రీలుగా ఏర్పాటు చేసుకొని, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని పోలీసు వారు గాని వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారని సిపి తెలిపారు. 

పట్టుపడిన వారి వివరాలు
ధరణి బాపు, పాత మంచిర్యాల.అన్నాల తిరుపతి, నాగపురం, గ్రామం చెన్నూరు మండలం, బడికల లచ్చయ్య, నాగపురం, గ్రామం చెన్నూరు మండలం,  కంచరపు వెంకటేశ్వరావు, కూరగాయల బిజినెస్ మల్కాపురం రోడ్డు, గోదావరిఖని, భూoబత్తుల,  బక్కయ్య,  మేకల మార్కెట్ వేంపల్లి, మంచిర్యాల, గాండ్ల సంతోష్, గుమస్తా, ఫోర్ట్ వరంగల్, .పెండాల రాజేందర్  కొలనూరు విలేజ్, పెద్దపల్లి, జోడి శ్రీనివాస్ రెబ్బెన. భీమనపల్లి శ్రీనివాస్ , కూరగాయల బిజినెస్ హనుమాన్ నగర్ గోదావరిఖని, .దాడి నగేష్, సీసీసీ నస్పూర్, లను  మరియు స్వాధీనపరుచుకున్న నగదు, సెల్ ఫోన్ లు, పేక ముక్కలను    స్వాధీనం చేసుకున్నామని, ఎంతో చాకచక్యంగా పేకాట పావురంపై దాడి చేసి వారిని నదుతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులను సిపి అభినందించారు.