ఘనంగా భారతరత్న  సేయింట్ మదర్ థెరిసా 113 వ జయంతి 

ఘనంగా భారతరత్న  సేయింట్ మదర్ థెరిసా 113 వ జయంతి 
  • యాచించి మరీ ఆనాధల కడుపునింపిన అమ్మ ! 
  •  బిషప్ డా దుర్గం ప్రభాకర్
  • ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ థెరిసా సోషల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర -కో చైర్మన్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-శనివారం 26 :బేతెస్థ చర్చ్, శాంతినగర్, బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసం నందు భారతరత్న, పద్మ శ్రీ, నోబెల్ శాంతి పురస్కారం గ్రహిత, సేయింట్ హుడ్ మదర్ థెరిసా  ఆగస్టు 26 113 వ జయంతి సందర్బంగా "ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ థెరిసా సోషల్ ఆర్గనైజేషన్"కమిటీ, పూల మాల వేసి ఘనంగా జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా బిషప్ డా దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే సెల్ఫీలు తీసుకుని సంతోషించే రోజులివి. రోడ్డుపై ప్రమాదం జరిగి ప్రాణం కోసం పరితపించే వ్యక్తి వీడియో స్నేహితులతో పంచుకునే అమానవీయ లోకమిది కానీ, ఆమె తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిందని,కష్టాల్లో ఉన్నవారినీ వెతికి మరీ సాయమందించిన అమ్మ మనసు ఆమెదనీ,ఆమె మరెవ్వరో కాదు, అందరికీ ‘అమ్మ’ సేయింట్ మథర్ థెరిసా.అంతటి మహనీయత గల వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.మదర్ థెరీసా 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించారు.మథర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్క్సా బొజాక్ష్యు. నికోల్లే, డ్రాన బొజాక్షిహ్యుల ఆఖరి సంతానం థెరిసా.ఆమె తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథ పిల్లల కోసం లెట్నికాలో ఆశ్రమం స్థాపించారు. అది ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది.థెరిసా కూడా తండ్రి బాటలోనే సేవా కార్యక్రమంలో ముందుండేవారు.1919లో తండ్రి జబ్బుతో మరణించారు. మృత్యువుకి ముందు ఆయన పడిన బాధ చూసి మదర్ థెరిసా 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమయ్యారు.18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరిన థెరిసా 1937, మే 4న కోల్‌కతాలో ఆ సంస్థకు చెందిన స్కూల్లో టీచర్‌గా చేరారు.కోల్‌కతాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితి ఆమెను కలచివేసింది. దీంతో టీచర్ ఉద్యోగానికి స్వస్తి పలికి మానవ సేవకు కదిలారు. అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేశారు.అనాథల పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో యాచించి మరీ వారి పొట్ట నింపేవారనీ ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు వాలంటీర్లుగా ముందుకొచ్చి మదర్‌కు సాయంగా నిలిచారనీ.1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు.ఈ చారిటీ ద్వారా ఆమె సుమారు 45 ఏళ్లు పేదలకు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.1951లో థెరీసాకు భారత పౌరసత్వం లభించింది.1979లో ఆమె సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి లభించింది,1980లో భారతరత్న పురస్కారం వరించింది.

థెరీసా సేవలు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరింపజేశారు.12 సంవత్సరాల వయస్సులోనే ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారనీ.కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటువ్యాధులు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధ, వికలాంగ, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు.1982లో ఇజ్రాయిల్ - పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు.1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి థెరీసా రాజీనామా చేశారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూన్నరాంటే ఆమె సేవా మాటల్లో చెప్పలేనిది. ఇంత గొప్ప మానవతావధి విగ్రహా ప్రతిష్ట కు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ సి. హెచ్ శ్యామ్ ప్రసాద్ ఆంధ్ర &తెలంగాణ రాష్ట్రల కో ఆర్డినేటర్,రెవ. ఐ. గాబ్రీయేల్ ఐ. పి. సి పాస్టర్స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు,రెవ. బొక్క ఏలీయా రాజు సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,చివ్వేంల అధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, పెన్ పహాడ్ అధ్యక్షులు రెవ. డి. జాన్ ప్రకాష్,సూర్యాపేట రూరల్ అధ్యక్షులు యల్క ప్రభాకర్,పాస్టర్ నిమ్మనగోటి జీవరత్నం,పి. వి. బోయాజ్, చింత మనిషే,వరికుప్పల మత్తయి,ధరవత్ నాగు నాయక్, బోడ లూకా, కొమ్ము హోసన్నా తదితరులు పాల్గొన్నారు.