240 గ్రా. ఎండు గంజాయి స్వాదీనం, ఇద్దరు అరెస్ట్

240 గ్రా. ఎండు గంజాయి స్వాదీనం, ఇద్దరు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ భీమ్ రెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించి 240 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బి.అరవింద్, పి. విజయ్ కుమార్ లను సంబందిత స్టేషన్కు అప్పగించారు. నడిమితాండకు చెందిన దేవసోత్ మోతిలాల్ తప్పించుకున్నాడు. దాడుల్లో ఎల్లయ్య, చంద్రయ్య, నవీన్, నరేష్, హరీష్, రాజు, రవి పాల్గొన్నారు.