37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
ముద్ర న్యూస్ బ్యూరో,హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించింది.
ఈనెల 14వ తేదీతోనే ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినేటేడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి చాలాకాలంగా చురుగ్గా పని చేస్తూ సేవలందించిన వారిని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ పదవులకు నామినేట్ చేశారు.
కార్పొరేషన్లకు నియమితులైన వారిలో
పటేల్ రమేష్ రెడ్డి,
నేరెళ్ల శారద,
నూతి శ్రీకాంత్ గౌడ్,
రాయల నాగేశ్వరరావు,
బండ్రు శోభారాణి,
ఎన్. ప్రీతమ్,
శివసేనారెడ్డి,
ఈరవత్రి అనిల్,
జగదీశ్వరరావు (కొల్లాపూర్),
మెట్టు సాయికుమార్,
గుర్నాథ్ రెడ్డి (కొడంగల్)
జ్ఞానేశ్వర్ ముదిరాజ్,
బెల్లయ్య నాయక్,
ప్రకాష్ రెడ్డి (భూపాలపల్లి),
జంగా రాఘవరెడ్డి,
ఇనుగాల వెంకట్రామి రెడ్డి,
రియాజ్,
కాల్వ సుజాత,
కాసుల బాలరాజు (బాన్సువాడ),
నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి)లకు పదవులు దక్కాయి.