మానవత్యం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి.....

మానవత్యం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి.....
  • బాధిత కుటుంబానికి  5 లక్షల ఎల్ఓసి  అందజేత

ముద్ర, చొప్పదండి:ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ మానవత్వాన్ని చాటారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన  కొలిపాక ప్రవళిక  అనారోగ్యంతో బాధపడుతూ  హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స నిమిత్తం 5 లక్షల ఖర్చు అవుతుందని తెలిపాగ నిరుపేద కుటుంబం కావడంతో  ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను ఆశ్రయించారు. దీంతో తక్షణమే  స్పందించిన ఎమ్మెల్యే  చికిత్స నిమిత్తం 5 లక్షల ఎల్ఓసి  మంజూరు చేయించారు.మంజూరి పత్రాలను కరీంనగర్ లోని ఆయన నివాసంలో  బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ఓసితో తమను ఆదుకున్న ఎమ్మెల్యే సత్యం కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.