మానవత్యం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి.....
- బాధిత కుటుంబానికి 5 లక్షల ఎల్ఓసి అందజేత
ముద్ర, చొప్పదండి:ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ మానవత్వాన్ని చాటారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొలిపాక ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స నిమిత్తం 5 లక్షల ఖర్చు అవుతుందని తెలిపాగ నిరుపేద కుటుంబం కావడంతో ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను ఆశ్రయించారు. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే చికిత్స నిమిత్తం 5 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు.మంజూరి పత్రాలను కరీంనగర్ లోని ఆయన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ఓసితో తమను ఆదుకున్న ఎమ్మెల్యే సత్యం కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.