ఏటియం ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..

ఏటియం ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..
  • యూరినరీ బ్లాడర్ నుంచి 65,45 యంయంల రాళ్లు తొలగింపు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏటియం ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన శస్త్ర చికిత్స చేసి యూరినరీ బ్లాడర్ నుంచి 65,45 యంయంల రాళ్లు తొలగించినట్లు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.  బీర్పూర్ మండలం మంగేలా గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడికి ఆపరేషన్ చేసి యూరినరీ బ్లాడర్ (మూత్రం సంచి) లోనుంచి 65,45 రాళ్ళను తీసివేశినట్లు డాక్టర్ తెలిపారు.  డా. సురేష్, డా. కళ్యాణ్ బృందం ఆపరేషన్ చేసి మూత్రం సంచిలోని రాయిని విజయ వంతంగా తొలగించినట్లు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.