అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ

సారంగాపూర్ ముద్ర: బీర్పూర్ మండలంలోని అసునూరి గూడెం చెందిన ఎదుల లక్ష్మీ, పెరుమల్ల శిరీష లకు చెందిన రెండు పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోగా మంగళ వారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తన వంతు సాయంగా పదివేల రూపాయల నగదును అందజేశారు. రెండు ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో రెండు కుటుంబాలు నిరాశ్రయులైనారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎంపీపీ రమేష్, సారంగాపూర్ బీర్పూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ రామచందర్ రెడ్డి, చెరుపూరి సుభాష్, నాయకులు డు గుడిసె జితేందర్ యాదవ్ ఉన్నారు.