పలు లాడ్జ్ లలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ

పలు లాడ్జ్ లలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ

ముద్ర, మల్యాల: కొండగట్టు కింద ప్రాంతంలోని పలు హోటల్స్, లాడ్జీలపై, అద్దె రూమ్ లలో గురువారం మల్యాల ఎస్ ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాటి నిర్వహణపై యజమానులకు తగు సూచనలిచ్చారు. అలాగే పలు వివరాలు సేకరించి, అనుమానితులను విచారించారు.

 రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...
మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మండలంలోని పలువురు రౌడీ షీటర్లకు గురువారం ఎస్ ఐ చిరంజీవి స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టేషన్లో హాజరు వేసుకోవడంతో పాటు, సత్పప్రవర్తనతో మెదలాలని ఎస్ ఐ సూచించారు.