ఆర్ధిక మాంద్యంలో అగ్రరాజ్యం

ఆర్ధిక మాంద్యంలో అగ్రరాజ్యం

అమెరికాలో డాలర్ల స్వప్నాలు కరిగిపోతున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి కలలు చెదిరిపోతున్నాయి.  అమెరికాలో ఆర్థికమాంద్యం వస్తే దాని ప్రభావం భారత్‌ లోని టెక్‌ కంపెనీలపై కూడా ఉంటుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టస్థాయికి చేరింది. స్టాక్‌ మార్కెట్లు సైతం భారీగా పతనమవుతున్నాయి. కోట్లాది రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది.కన్నవారిని, బంధుమిత్రులను, మాతృభూమిని వదిలి ఇక్కడ మంచి భవిష్యత్‌ కోసం ఎన్నో ఆశలతో వచ్చారు. కానీ వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పూర్వపరిస్థితులు వచ్చి వారి కలలు నెరవేరాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. ఒకవైపు ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, మరోవైపు కరోనా మహమ్మారితో అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ ఫోర్స్‌, గూగుల్‌, టెస్లా, స్నాప్‌ చాట్‌, ట్విట్టర్‌, కేపిటల్‌ వన్‌ బ్యాంక్‌ లాంటి దిగ్గజ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు.

గతేడాది అక్టోబర్‌లో వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది రెసిషన్‌ వస్తుందని, న్యూయార్క్‌ ఫెడ్‌ సర్వేలో కూడా 47శాతం పైగా రెసిషన్‌ ప్రభావం ఉంటుందని ప్రకటించాయి. ఇప్పటికే యూరప్‌, యూకే, అమెరికా సహా అనేక దేశాల్లో భారీగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు పేదరికం పెరగడంతో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం, ఇతర దేశాల్లోని కరెన్సీలు బాగా బలహీనపడటంతో డాలర్‌ మాత్రం బలంగా ఉంది.వాషింగ్జన్‌ పోస్ట్‌ లెక్కల ప్రకారం లే ఆఫ్‌ల కారణంగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఇతర రంగాల్లో కూడా సుమారు లక్ష మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

ఉద్యోగం కోల్పోయిన వారిలో అత్యధిక భాగం భారతీయులే ఉండటం గమనార్హం. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగం కోల్పోయి ఉంటారు. వీరంతా హెచ్‌1బీ వీసాదారులే. వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి 60 రోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరాలి. ఈ పరిస్థితుల్లో కొత్తగా నియామకాలు కూడా కంపెనీలు చేపట్టడం లేదు. ఉద్యోగం రాకపోతే అమెరికా వదిలివెళ్లాలి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో అమెరికా ప్రభుత్వం అన్ని రంగాల్లోని ఉద్యోగులకు, కంపెనీలకు, ఇతర సంస్థలకు నిరుద్యోగ భృతి పేరుతో వివిధ రూపాల్లో డబ్బులు పంపిణీ చేసింది.మార్కెట్‌లో నగదు చెలామణి పెరగడం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. దీంతో ఆహారం, ఇంధన, ఇతర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. ఇంకా ముందుంది ముసళ్ల పండగ. ఈ ఏడాది జూన్‌ తర్వాత మరింత ఆర్థిక సంక్షోభం ఎదురుకానుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలియజేస్తోంది. కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి మరింత మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక్కడ కార్మిక చట్టాలు ఏవీ ఉండవు. ఎప్పుడైనా, ఎవరినైనా తొలగించవచ్చు. ఆర్థిక సంక్షోభానికి తోడు సమర్థ పాలన కొరవడటంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది.ఇక్కడికి కొత్తగా వచ్చే వారు, రావాలనుకునేవారు కొద్దికాలం వేచిచూస్తే మంచిది. సాంకేతిక నైపుణ్యం మెరుగుపర్చుకునేవారు మనగలుగుతున్నారు. ప్రతిభ ఉన్న మరికొంతమంది హోదా తగ్గించుకొని తక్కువ జీతంతో వేరే కంపెనీల్లో చేరుతున్నారు.

అమెరికాను వదిలివెళ్లడం ఇష్టంలేని కొద్దిమంది తమ వీసా స్టేటస్‌ను మార్చుకుని యూనివర్సిటీల్లో చేరి మాస్టర్స్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి మరింత మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక్కడ కార్మిక చట్టాలు ఏవీ ఉండవు. ఎప్పుడైనా, ఎవరినైనా తొలగించవచ్చు. ఆర్థిక సంక్షోభానికి తోడు సమర్థ పాలన కొరవడటంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కొత్తగా వచ్చే వారు, రావాలనుకునేవారు కొద్దికాలం వేచిచూస్తే మంచిది. సాంకేతిక నైపుణ్యం మెరుగుపర్చుకునేవారు మనగలుగుతున్నారు. ప్రతిభ ఉన్న మరికొంతమంది హోదా తగ్గించుకొని తక్కువ జీతంతో వేరే కంపెనీల్లో చేరుతున్నారు. అమెరికాను వదిలివెళ్లడం ఇష్టంలేని కొద్దిమంది తమ వీసా స్టేటస్‌ను మార్చుకుని యూనివర్సిటీల్లో చేరి మాస్టర్స్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు శక్తి పెరగాలంటే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరగాలి. అప్పుడే కంపెనీల ఉత్పత్తులు పెరుగుతాయి. ఉత్పత్తులు పెరగాలంటే వస్తు వినిమయం పెరగాలి. ఇదంతా ఒక సైకిల్‌. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది.ఉద్యోగ అన్వేషణ సవాలుగా మారిన నేపథ్యంలో ఈ విపత్తు నుండి బయటపడటానికి ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ సోషల్‌ విూడియా వేదికగా అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. వీసా విధానంలో మార్పులు వస్తే తప్ప ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడలేరని ఐటీ నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తే స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయి. హౌసింగ్‌ మార్కెట్‌ కూడా బాగుంటుంది. నిదానంగా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. తిరిగి జాబ్‌ మార్కెట్‌ కూడా పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.