మండల ప్రజలందరికీ విజ్ఞప్తి

మండల ప్రజలందరికీ విజ్ఞప్తి

కిడ్నాపర్లు అంటూ ఎవరైనా పుకార్లు సృష్టిస్తే ఎవ్వరూ నమ్మవద్దు.
మోత్కూర్(ముద్ర న్యూస్):తెలుగు భాష రాని ఎవరైనా వ్యక్తి మన కాలనీలలోకి వస్తె వారిని ఒక దొంగ గానో, కిడ్నాపర్లు గానో చూడకూడదు అని  ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ అన్నారు.  మీ కాలనీలలో అపరిచిత వ్యక్తులు తిరిగితే వారి యొక్క పూర్వాపరాలు విచారించిన తరువాతనే ఒక నిర్ధారణకు రావాలి తప్ప, తొందరపడి అసత్యపు వార్తలు సోషల్ మీడియా నందు పోస్ట్ చేసి ప్రజలని భయబ్రాంతులకు గురిచేయకూడదని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు