శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులుగా బీర్ల నియామకం......

శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులుగా బీర్ల నియామకం......

ఆలేరు (ముద్ర న్యూస్): తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సభ్యులుగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ సభ్యులు బీర్ల అయిలయ్యను నియమిస్తూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ సమావేశంలో గడ్డం ప్రసాద్ నియమించిన సందర్భంగా బీర్ల అయిలయ్యతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్ ఓవైసీ, పూనంనేని సాంబశివరావు లను సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను సలహా మండలికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.