కరీంనగర్ కు చేరుకున్న అస్సాం ముఖ్యమంత్రి

కరీంనగర్ కు చేరుకున్న అస్సాం ముఖ్యమంత్రి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ కు చేరుకున్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో అస్సాం ముఖ్యమంత్రి కి బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ స్వాగతం పలికారు. హిమంత్ బిశ్వ శర్మ, బండి సంజయ్ కుమార్  కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. సుమారు 6 గంటల ప్రాంతంలో హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొని మాట్లాడుతారు. కరీంనగర్ కాషాయమైంది. ఇప్పటికే హిందూ సంఘటన శక్తిని చాటెందుకు వేలాదిగా కాషాయ దండు కదిలి వచ్చింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో కరీంనగర్ మార్మోగుతుంది.