సి ఎం ను కలిసిన ప్రైవేట్ డిగ్రీ, పి జి కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు బి.సూర్యనారాయణ రెడ్డి

సి ఎం ను కలిసిన ప్రైవేట్ డిగ్రీ, పి జి కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు బి.సూర్యనారాయణ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రైవేట్ డిగ్రీ, పిజి కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రవేట్  డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను  సీఎంకి వివరించారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు  వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.