స్వర్ణ గిరి ఆలయాన్ని దర్శించుకున్న రోటరీ క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు

స్వర్ణ గిరి ఆలయాన్ని దర్శించుకున్న రోటరీ క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరిలోని స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులురవిచంద్రన్ దంపతులు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ లు బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపకులు మానేపల్లి రామారావు వారికి స్వామివారి తీర్థ ప్రసాదములను అందజేశారు. ఆలయ విశేషతలను మానేపల్లి రామారావు స్వయంగా తెలియజేస్తూ ఆలయంలోని బంగారు బావి, హనుమాన్ దేవాలయం, కోరికల గంట, జలనారాయణ, వాసవి మాత దేవాలయాల విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ప్రెసిడెంట్ జడిగం లక్ష్మయ్య, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్, కోశాధికారి సోమ బనారస్, సభ్యులు పోకల సోమన్న, తాటిపల్లి రవీందర్, మిత్తింటి భాస్కర్, కోడితాల కరుణా సాగర్, యెడవల్లి వినయ్ కుమార్ పాల్గొన్నారు.