ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన 15 దరఖాస్తులను స్వీకరించారు. వాటిలో 10 రెవిన్యూ శాఖ, మున్సిపాలిటీ శాఖ 4, జిల్లా పంచాయితీ అధికారి ఒకటి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జి.వీరారెడ్డి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు భాస్కరరావు, జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి, కలెక్టరేటు సూపరింటెండెంట్ రామ్మూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.