Bandi Sanjay - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు ...

Bandi Sanjay - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు ...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జరిగిందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తముందని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌తో జిల్లా మంత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో లాలూచీ పడి కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.