సీఎం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సీఎం పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  జగిత్యాల జిల్లా  పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. వెలగటూరు మండలం రాజరాంపల్లిలో శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జనజాతర భహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సభకు సియం హాజరవుతున్న సందర్భంగా బహిరంగ సభాస్థలి,   భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు  బందోబస్తు  పరంగా  చేయవలసిన ఏర్పాట్ల గురించి ఎస్పి అధికారులకు పలు సూచనలు చేశారు.

భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి వెళ్లే దారులు జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.   ఎస్పీ  వెంట ఏఎస్పి శివం ఉపాధ్యాయ, డిఎస్పి రఘు చంధర్, ఎస్ బి  ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు,సి.ఐ రామ్ నరసింహారెడ్డి,  ఎస్.ఐ ఉమా సాగర్ ఉన్నారు.