బాపట్ల టీడీపీ ఎంపి సీటు అగ్గిరామయ్యకు?
బాపట్ల తెలుగుదేశం ఎంపి సీటు ఎన్నారై దేవరపల్లి అగ్గిరామయ్యకు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఎస్.సి. సామాజిక వర్గానికి చెందిన అగ్గిరామయ్యకు తెలుగుదేశం నాయకులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు గట్టి మద్దతు ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలోనే కాక జనసేన, బీజేపీ పార్టీలనుంచి కూడా అగ్గి రామయ్యకు మంచి మద్దతు ఉంది.
విద్యార్ధి దశనుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న అగ్గి రామయ్య ఎందరో పేద విద్యార్ధులను ఆర్ధిక సహాయం చేసి చదివిస్తున్నారు.
ఎన్ ఐ టి కాలికట్ నుంచి ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకుని 2007 నుంచి అమెరికాలో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజా, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్గొంటున్న అగ్గిరామయ్యకు సీటు ఇస్తే గెలుపు సులభమని ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు.
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజాసంక్షేమానికి తన జీవితాంతం కృషి చేస్తానని అగ్గిరామయ్య చెప్పారు.