శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో విజయం సాధిస్తా: భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో విజయం సాధిస్తా: భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్

 ముద్ర ప్రతినిధి భువనగిరి : తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని,స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. సోమవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తమ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలో పరిసరాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.