వాసవి పరపతి సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికునికి సన్మానం....

వాసవి పరపతి సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికునికి సన్మానం....

ఆలేరు (ముద్ర న్యూస్):77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ కేంద్రానికి చెందిన  ముదిగొండ శంకర్ ను వాసవీ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన. చేస్తున్న సైనికుల సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి సరాబ్ సంతోష్ కుమార్. పవర్ శ్రీనివాస్. తోట ప్రశాంత్. బెల్దె సంతోష్. సముద్రాల వేణు. బేల్దే  శ్రీధర్. నాగబండి నాగేందర్. జిలాల్ శ్రీనివాస్. బచ్చు మణికంఠతో పాటు తదితరులు....