బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్

బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, మెదక్ :77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, వారి త్యాగంతో నేడు స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నామని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, నాయకులు వీణ, సుభాష్ గౌడ్, శివ, ఎంఎల్ఎన్ రెడ్డి, ఎక్కలదేవ్ మధు తదితరులు పాల్గొన్నారు.