రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనం కోసం ఎమ్మెల్సీ శేరి భూమి పూజ

రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనం కోసం ఎమ్మెల్సీ శేరి భూమి పూజ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం 5వ వార్డు ఇందిరాపురి కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కాలనీ అధ్యక్షులు గోపాలరావు, రైతుబంధు అధ్యక్షుడు తాడెపు సోములు, సర్పంచులు దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి, యామి రెడ్డి, ఉప సర్పంచ్ అజయ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శేఖర్ గౌడ్,  కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కాలనీ ప్రముఖులు జైపాల్ రెడ్డి, నర్సింహారెడ్డి, హన్మంత్ రెడ్డి, సిద్దిరాములు, స్వామి, రాం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ గౌడ్,భూమయ్య జయరాములు, కృష్ణ, తదితరులు కూడా ఉన్నారు.