ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

 బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామ ఎంపీటీసీ ధీరావత్ బీమ్లా నాయక్ సోమవారం భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే స్వగృహంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలకూర జంగయ్య గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు కొరిమిల్ల కృష్ణ రెడ్డి, డైరెక్టర్ చంద్రమణి తదితరులు పాల్గొన్నారు.