రాయన్ పల్లి ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్ షా
మూద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో పేరొందిన రాయన్ పల్లి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సందర్శించారు. ప్రాజెక్ట్ ఓవర్ ఫ్లో వీక్షించారు. ఆయకట్టు వివరాలు నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 230 ఎంసిఎఫ్టి, 1200 ఎకరాలకు సాగవుంతుందని, కాలువ ద్వారా మెదక్ లోని 5 చెరువులు నిండుతాయని ఎస్ఈ యేసయ్య తెలిపారు. కొమాటూరు చెరువు నిండుతుందన్నారు.
కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమతంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని తెలిపారు. పరిసరప్రాంతాలలో మురికి నీరు నిలువలు లేకుండా చూసుకోవాలని ఎక్కడపడితే అక్కడ మూత్ర, మలవిసర్జన చేయకూడదని, చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ద వాహించాలన్నారు. వెంట నీటిపారుదలశాఖ ఈఈ శ్రీనివాస్, డిఈ శివనాగరాజు, ఏఈ శ్రీహరి, తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ సిద్దగౌడ్ తదితరులున్నారు.