సాయం చేసే 'చేతి' ని మరువద్దు..

సాయం చేసే 'చేతి' ని మరువద్దు..
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సాయం చేసే 'చేతి' ని మరువద్దని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం, మేదరమట్ల, అంకుషాపూర్, ఇస్సీపేట, మొగుళ్లపల్లిలో సత్యనారాయణ రావు పర్యటించి, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేసి, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అనంతరం భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గాజర్ల అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, ఆకుతోట కుమారస్వామి, పోల్నేని లింగారావు, రాజు, మండ రవీందర్, బండి సుదర్శన్, కామిడి రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.