తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 
  • సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.  వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం స్వామివారిని 66,162 మంది భక్తులు దర్శించుకోగా 27,668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.24కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.