డీకే వర్సెస్ సిద్ధి రామయ్య
కన్నడ కాంగ్రెస్లో సీఎం సీటు పంచాయతీ మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో డీకే శివ కుమార్ పాత్ర ముఖ్యమని ఇప్పటికే ఏఐసీసీ పలుమార్లు మెచ్చుకున్నది. ప్రస్తుతం పార్టీ పగ్గాలు డీకే చేతిలో ఉండగా.. అధికారిక బాధ్యతలను సిద్ధి రామయ్యపై పెట్టారు. గత ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ఉంది. శివ కుమార్ కాంగ్రెస్ను అంటీపెట్టుకుని ఉండగా, సిద్ధి రామయ్య బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో డీకే శివ కుమార్ ది కీలక బాధ్యతగా మారింది. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారు. ఆయన వర్గీయులతో పాటుగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన ఆధ్వర్యంలోనే క్యాంపునకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సీటు పంచాయతీపై కర్ణాటకలో పలు ప్రచారాలు మొదలయ్యాయి.
సీఎంగా సిద్ధి రామయ్య, పార్టీ చీఫ్గా డీకే శివ కుమార్ కొనసాగుతారని పార్టీలోప్రచారం మొదలైంది.కానీ, సీఎం సీటు కోసం ఈసారి డీకే కూడా పోటీ పడుతున్నారు. తాజా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. దీంతో సీఎం సీటు ఎవరిని వరిస్తుందనే ప్రచారం మొదలైంది. పార్టీలోని మెజార్టీ వర్గం మాత్రం డీకే శివ కుమార్కు మద్దతుగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక, డీకే శివ కుమార్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉంటుందని టీపీసీసీ భావిస్తున్నది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి డీకే శివ కుమార్తో సన్నిహిత సంబంధాలున్నాయి. టీపీసీసీ చీఫ్ నియామకం కోసం శివ కుమార్ సపోర్ట్ చేశారనే టాక్ కూడా ఉంది.అంతేకాకుండా మాస్ లీడర్గా శివ కుమార్కు రాష్ట్రంలో అభిమానులున్నారు.