శక్తి పీఠం ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
మెదక్ జిల్లా శివంపేటలో నిర్మించిన శక్తిపీఠం, శ్రీ బగళాముఖి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాల్సిందిగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. శక్తిపీఠం ట్రస్టు అధ్యక్షుడు శాస్ర్తుల వెంకటేశ్వర శర్మ, శివకుమార్,మహేశ్ గుప్త, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.