మణిపూర్​లో ఫైరింగ్.. కొనసాగుతున్న ఆందోళనలు

మణిపూర్​లో ఫైరింగ్.. కొనసాగుతున్న ఆందోళనలు

మణిపూర్: మణిపూర్​లో హింస ఎంతకీ చల్లారడం లేదు. ఆదివారం రాత్రి కూడా రెండు ప్రాంతాల్లో హింస చోటు చేసుకున్నట్లు, గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్రాంతాలను భద్రతా దళాలు పోలీసులు చుట్టుముట్టగా అప్పటికే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. గత నెల రోజులుగా మణిపూర్​లో చెలరేగుతున్న హింస కారణంగా వందమందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3000మందికి గాయాలయ్యాయి. లక్షమంది వరకూ నిరాశ్రయులయ్యారు. మరోవైపు ప్రభుత్వం శాంతి చర్చలు చేపడుతున్నా అవి ఫలితాలివ్వడం లేదు.