కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ: తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'ఈ రోజు ఒకరు ఈ గిఫ్ట్ ఇచ్చారు' అనే ట్యాగ్‌తో 'ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారత్' అనే పుస్తకం కవర్ పేజీ ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు. కాగా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఇదివరకే కేటీఆర్ వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యమని బీజేపీ సర్కార్ లక్ష్యమని వారం రోజుల క్రితమే మీడియా సమావేశంలో కేటీఆర్ అన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీని ఎందుకు ప్రశ్నించరని విమర్శించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.