ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా

ముద్ర నేరేడుచర్ల నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 243,244 లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా అధ్వర్యంలో నేరేడుచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, ఎంఆర్వో కార్యలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా లో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు G. వెంకటేశ్వర రావు, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.