దుబ్బాక ఏఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే

దుబ్బాక ఏఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే

గోదాము రేకులు వెంటనే మరమ్మత్తు చేయించాలని డిమాండ్

సిద్దిపేట,ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా  దుబ్బాకలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీని  మంగళవారం ఉదయం దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు  సందర్శించారు రెండు నెలల క్రితం గాలి, దుమారానికి ధ్వంసం అయినా గోదాముల పైకప్పులను ఇప్పటివరకు మరమ్మత్తు చేయకపోవడంపై విస్మయము వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రఘునందన్ రావు వెంట బిజెపి నేతలు పలువురు ఉన్నారు.