వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు...
  • వరి ధాన్యం పోయడానికి స్థలలు లేక రైతులు ఇబ్బందులు... 
  • రోడ్లమీద ఆరబోస్తున్న ధాన్యం...
  • పాటించుకోని అధికారులు..

గొల్లపల్లి. ముద్ర:- గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రలకు స్థలాలు లేక రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయడంతో  ప్రమాదాలు జరిగేలా ఉన్నాయని అంటున్నా వాహనాదారులు గొల్లపల్లి మండలంలో పలు గ్రామాల రైతులు పండించిన ధాన్యాన్నిఆరబోసుకునేందుకు సరైన కళ్లాలు లేకపోవడంతో  రహదారికి సంబంధించిన రోడ్లను వినియోగించుకొని ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.కానీ రాత్రి పూట ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగేలా ఉందని వాహనాదారులు ఉన్నంత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవగాహన కల్పించకపోవడంతో వారు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారని.గ్రామాల్లో ధాన్యానికి స్థలాలు ఎంపిక చేయకపోవడం అధికారులనిర్లక్ష్యంని వ్యవహరింస్తున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతధికారులు రైతులతో మాట్లాడి వాహనదారులకు ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు.