ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ముద్ర,సెంట్రల్ డెస్క్:- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. డివైడర్ అవతలి రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపై పడింది. విల్లాపురానికి చెందిన కనగవేల్ - తన కుటుంబంతో కలిసి తలవాయిపురంలో ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.

కాగా.. ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డయింది. విరుదునగర్-మధురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద బైక్ ను కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తెలిపారు. మరణించిన ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని,మదురైలోని విలపురం ప్రాంతంలో నివాసం ఉంటున్నారని అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.