కాంగ్రెసులో చేరిన సారంగపూర్ మాజీ జెడ్పిటిసి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సారంగపూర్ మాజీ జెడ్పిటిసి, తుంగూర్ మాజీ సర్పంచ్ ముక్క శంకర్ బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెసు పార్టీలో చేరారు. బీర్పూర్ మండలం తుంగూర్ బి ఆర్ ఎస్ నాయకులు, ఉమ్మడి సారంగపూర్ మండల మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్ తో పాటు బిఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు బోలిశెట్టి గంగాధర్ 50 మంది యువత, మహిళలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ ఎంపీపీ మాసర్తి రమేష్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు, మాజీ ఎంపీపీ గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జున్ను రాజేందర్ , సుభాష్, మాజీ సర్పంచ్ గంగాధర్ , శీలం సురేంధర్ , ఎంపీటీసీ భూమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.