పిడుగు పాటుకు 20 గోర్లు మృతి
![పిడుగు పాటుకు 20 గోర్లు మృతి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64440d5aad7c2.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బీమారం మండలం గోవిందారంలో శనివారం కురసిన అకాల వర్షం కురిసి పిడుగు పడి గ్రామానికి చెందిన గంగానవేని దేవయ్య కు చెందిన 20 గోర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పిడుగు పడి 20 గొర్రెలు మరణించడంతో దేవయ్య కు సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవయ్యను ఆదుకోవాలని, తక్షణమే భరోసా కల్పించి సహాయం అందించాలని గ్రామ సర్పంచ్ కరండ్ల మధుకర్ ఉన్నత అధికారులను, స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు.