టిఎన్ఓ రాష్ట్ర కార్యదర్శిని సన్మానించిన జగిత్యాల జిల్లా నాయకులు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ ఎన్జీవో ల కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి గా మొట్టమొదటి సారిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మారం జగదీశ్వర్ ను జగిత్యాల జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఉధ్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్ ఆధ్వర్యంలో సన్మాణించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల నీటిపారుదల శాఖ జగిత్యాల జిల్ల ప్రధాన కార్యదర్శి సల్వాజి శ్రీనివాస్, వరాల ఆంజనేయులు, ఎమ్.డీ. శటసోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.