పీఎం మన్ కి బాత్ ను వీక్షించిన బీజేపీ నేతలు

పీఎం మన్ కి బాత్ ను వీక్షించిన బీజేపీ నేతలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: భారత ప్రధాని నరేంద్రమోడీ100 వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు సామూహికంగా వీక్షించారు.  కామారెడ్డిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎంజీ వేణుగోపాల్ గౌడ్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి వీక్షించడం జరిగింది. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భి అప్నా ఏక్ దేశ్ నినాధం తో నరేంద్ర మోదీ  నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పుర్తి చేస్కోవడం ఈ కార్యక్రమం ద్వారా నలుమూలల్లో ఉన్న భారతీయులను ఏకం చేస్తునందుకు నరేంద్ర మోదీకీ ధన్యవాదాలు తేలియజేయడం జరిగింది.

 పట్టణంలోని 26 వ వార్డు పరిధిలోని 237 వ బూత్ పరిధిలో  బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కార్యకర్తలతో కలిసి వీక్షించారు. భారతీయ జనతాపార్టీ  100 వ ఎపిసోడ్ లైవ్ కార్యక్రమం గాంధి చౌక్ లోని S.V.R కంప్యూటర్స్ లో వీక్షించం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పదాదికారులు మండల పట్టణ నాయకులు కార్యకర్తలు వివిధ మోర్చలు పాల్గొనడం జరిగింది.  బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లోనూ బీజేపీ నాయకులు మన్ కి బాత్ ను వీక్షించారు.