సర్పంచ్ నాయిని శ్రీనివాస్ కు పౌర సన్మానం.

సర్పంచ్ నాయిని శ్రీనివాస్ కు పౌర సన్మానం.

ముద్ర న్యూస్, కాటారం:ఇటీవల మండల కేంద్రమైన కాటారం గ్రామ పంచాయతీ ఇంచార్జ్ సర్పంచ్ గా నియమతులైన నాయిని శ్రీనివాస్ ను కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన అంగడి బజార్ వాసులు ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అంగడి బజార్ వాసులు మాట్లాడుతూ కాటారం గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో నాయిని శ్రీనివాస్ మరెన్నో పదవులు చేపట్టి ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు.గత పదిహేనేళ్ళుగా కాటారం గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులుగా,ఉపసర్పంచ్ గా సేవలందించిన శ్రీనివాస్ సర్పంచుగా నియామకం కావడం గ్రామ ప్రజలకు గర్వకారణమన్నారు.ఈ సందర్భంగా నాయిని శ్రీనివాస్ అంగడి బజార్ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగడి బజార్ వాసులు తక్కళ్లపెల్లి చలపతిరావు,ఏపూరి నర్సయ్య, పెండ్యాల శ్రీరాములు,గైని రమేష్,బట్టి దార్ సింగ్, బట్టి రతన్ సింగ్, రిటైర్డ్ ఉపాద్యాయులు శంకర్, చీర్ల రమేష్ రెడ్డి,చీర్ల తిరుపతి, చీర్ల రవీందర్,బొంతల రవీందర్,తాళ్లపెల్లి స్వామి, తాళ్లపెల్లి రవి శంకర్,పోలు రాజమౌళి,దోమల సత్యనారాయణ,దోమల రాజబాబు,దోమల రాజశేఖర్,  దోమల రమేష్,మహమ్మద్ గౌస్,ఎలగం రాజనారాయణ, ఎలగం సత్యనారాయణ,గాదె వనసూర్య,గైని వెంకటమ్మ, పోలు భాగ్య లక్ష్మి, దోమల భారతి, బట్టి రాజేశ్వరి, గాదె విజయ,గాదె మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.