నలుగురికి ఉపకారం చేసే మనస్తత్వం  బ్రాహ్మణులది 

నలుగురికి ఉపకారం చేసే మనస్తత్వం  బ్రాహ్మణులది 
  • బ్రాహ్మణ గర్జనకు సిద్దిపేట నుంచి భారీగా తరలిన బ్రాహ్మణులు

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:సమాజ ప్రగతికి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయడమే బ్రాహ్మణుల మనస్తత్వం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ కితాబునిచ్చారు. ఆదివారంనాడు హైదరాబాదులో జరిగే బ్రాహ్మణ గర్జనకు తరలి వెళ్తున్న వాహనాలకు జెండా ఊపి ఆమె ప్రారంభించారు.

జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన బ్రాహ్మణులు, సిద్దిపేటలోని కోటిలింగేశ్వర దేవాలయం వద్ద నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మంగు హరిహరరావు, కార్యదర్శి భాస్కర్ శర్మ, శ్రీనివాస్ శర్మ, మృత్యుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు.