జాతీయ పురస్కారం కు ఎంపికైనా గంగుల శ్రీనివాస్ 

జాతీయ పురస్కారం కు ఎంపికైనా గంగుల శ్రీనివాస్ 

ముద్ర,రాయికల్ :- రాయికల్ మండలం మైతా పూర్ గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాస్ సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.గతంలో నిరుపేద లకు అన్నదానం, పేద యువత వివాహానికి ఆర్థిక సహాయం, రోగులకు ఆర్థిక చేయూత ఇలా ఆయన చేసిన అనేక సేవలను పురస్కరించుకొని యువ చైతన్య యూత్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ జాతీయ నాయకులు వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతోత్సవాలను పురస్కరించుకొని జాతీయ పురస్కారాలు వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని టిఎన్జీవో భవన్ లో గంగుల శ్రీనివాస్ కు జాతీయ పురస్కారాన్ని అందించారు.ఇట్టి సందర్భంగా ఆయన చేసిన సేవలను నిర్వాహకులు  కొనియాడారు.