టాక్స్ చెల్లించని 8 వాహనాలు సీజ్..

టాక్స్ చెల్లించని 8 వాహనాలు సీజ్..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ట్యాక్స్ చెల్లించని 8 వాహనాలు సీజ్ చేసినట్లు శ్యామ్ నాయక్ తెలిపారు. జిల్లాలో టాక్స్ చెల్లించకుండా 4వేల వాహనాలు తిరుగుతున్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు.  డిపిఓ శ్యాం నాయక్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో 8 వాహనాలు ట్యాక్స్ చెల్లించకుండా పెండింగ్లో ఉండడంతో వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

సీజ్ చేసిన వాహనాలను ఆర్టీసి డిపోకు తరలించారు. పెండింగ్లో ఉన్న టాక్స్ లన్ని వాహన దారులు చెల్లించేంతవరకు జిల్లాలో విస్తృత తనిఖీలు చేపడతామని డిటిఓ శ్యామ్ నాయక్ పేర్కొన్నారు. ఈ తనికిలో ఎంవిఐలు వంశీధర్, వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.