లక్ష్మీదేవి పల్లి భవాని ఆలయంలో శీత్ల వేడుకలు

లక్ష్మీదేవి పల్లి భవాని ఆలయంలో శీత్ల వేడుకలు

సారంగాపూర్,ముద్ర: సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి మంగళవారం బంజారాల కులదైవమైన  భవాని ఆలయంలో శీత్ల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భవాని ఆలయం సందర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ సంతోష్,మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ నరసింహ రెడ్డి,గ్రామ శాక అధ్యక్షుడు తిరుపతి,బంజారా సంఘం అధ్యక్షుడు భూక్యా రవి నాయక్,ఆలయ అర్చకులు లవుడ్య  రాజన్న,నాయకులు సంబారి గంగాధర్,హరి చాంద్,వినోద్,శేకర్,మల్లేష్,శంకర్,భూక్యా గంగాధర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.