బొంబాయిలో గుండె పోటుతో వెల్గటూర్ వాసి  మృతి..

బొంబాయిలో గుండె పోటుతో వెల్గటూర్ వాసి  మృతి..

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన గంట్యాల సురేష్(46) బొంబాయిలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు.  కాగా ఆయన మృతితో వెల్గటూర్ లో విషాదం నెలకొంది. కాగా సురేష్ జీవనోపాధి కోసం బొంబాయి వెళ్ళాడు. అక్కడ తాను నివాసం ఉండేచోట గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెల్లగా చికిత్స పొందుతు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. కాగా వెల్గటూర్ మండలంలో వారం రోజులలో ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో చనిపోవడం ఆందోళనను కలిగిస్తుంది.