రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్, ముద్ర: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ గుడేపు శ్రీనివాసు అన్నారు. సోమవారం మండల పరిధిలోని వేపలసింగారంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వహణలో రూపొందించిన వ్యవసాయ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హుజూర్ నగర్  నియోజకవర్గానికి  వేలకోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాడని అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందించేందుకు కొత్త లిఫ్టుల ఏర్పాటు, ముత్యాల బ్రాంచ్ కెనాల్ 13 బ్లాకు కి మరమ్మత్తులు, సీసీ లైనింగ్ ఏర్పాటు నిధులు విడుదల చేశారని అన్నారు. రైతుబంధు రైతు బీమా అలాంటి పథకాలు రైతు సంక్షేమానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సార్ రెడ్డి భాస్కర్ రెడ్డి, గోపిరెడ్డి రాజమోహన్ రెడ్డి, సామల రాంరెడ్డి హరిలీల పాల్గొన్నారు.